ఎల్బీనగర్, జనవరి 19 : అంధత్వ రహిత తెలంగాణకు సాకారం చేద్దామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గడ్డిఅన్నారం డివిజన్ కోదండరాంనగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కంటి వెలుగు తొలి దశలో ప్రజలకు మేలు జరిగిందని, రెండవ దశ కంటి వెలుగు ప్రారంభం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు మరోసారి కంటి పరీక్షలు నిర్వహించనున్నారన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన కంటివెలుగు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అంధత్వ రహిత తెలంగాణను సాకారం చేద్దామన్నారు. వంద రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాలను ప్రజలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేంమహేశ్వర్రెడ్డి, సరూర్నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరికృష్ణయ్య, డాక్టర్లు అర్చన, అరుణ, గడ్డిఅన్నారం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం యాదవ్, మాజీ కార్పొరేటర్ ప్రవీణ్కుమార్, ప్రేంనాథ్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి కళ్ల అద్దాలను అందించే కంటి వెలుగు పథకం దేశంలోనే గొప్ప పథకమని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త అన్నారు. గురువారం కొత్తపేట డివిజన్లోని కొత్తపేట మహిళా మండలి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీ దయానంద్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు ఎంతో ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టి అద్భుతంగా అమలు చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ కంటి వెలుగు శిబిరాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట కార్పొరేటర్ పవన్కుమార్, ఉప కమిషనర్ హరికృష్ణయ్య, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాశ్ గౌడ్, కొత్తపేట పీహెచ్సీ డాక్టర్ నరేశ్, ఏఈ మాతృనాయక్, నాయకులు శరత్చంద్ర, వరుణ్చంద్ర, కృష్ణమూర్తి పాల్గొన్నారు.చైతన్యపురి డివిజన్లోని న్యూదిల్సుఖ్నగర్ కమ్యూనిటీహాల్లో కంటి వెలుగు శిబిరాన్ని కార్పొరేటర్ నర్సింహ గుప్త ప్రారంభించారు. లింగోజిగూడ డివిజన్లోని ఎస్బీహెచ్ కాలనీ కమ్యూనిటీహాల్లో కంటి వెలుగు ప్రారంభమైంది.
చంపాపేట : దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. చంపాపేట మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ సర్కిల్ ఉపకమిషనర్ సురేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సుంకోజు కృష్ణమాచారి, బీఆర్ఎస్ సీనియర్ నేతలు నల్ల రఘుమారెడ్డి, గోగిరెడ్డి అంజిరెడ్డి, చంపాపేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజ్కుమార్రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు శాగ రోజారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి భవానీనగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు పరీక్ష కేంద్రాన్ని కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి, జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్, డాక్టర్ పులేందర్ నాయుడు, డాక్టర్ నిర్మలాదేవి, మన్సూరాబాద్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, కర్మన్ఘాట్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు పోచబోయిన జగదీశ్ యాదవ్, నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రి వెంకన్న కురుమ, బీసీ సెల్ అధ్యక్షుడు రుద్ర యాదగిరి, నాయకులు నాంపల్లి రామేశ్వర్, సిద్దగోని జగదీశ్గౌడ్, విజయభాస్కర్ రెడ్డి, భాస్కర్యాదవ్, శ్రీధర్గౌడ్ పాల్గొన్నారు.
నాగోల్ డివిజన్ పరిధి బ్లైండ్స్కాలనీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ ప్రారంభించారు. చింతల సురేందర్, డాక్టర్ నిఖిత పాల్గొన్నారు.
హయత్నగర్ : హయత్నగర్ డివిజన్ పరిధిలోని నూతన వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్తో కలిసి హయత్నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి ప్రారంభించారు.
వనస్థలిపురం : హస్తినాపురం డివిజన్లోని పద్మపాణి ఆచార్య భవన్లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ ప్రారంభించారు. బీఎన్రెడ్డినగర్ డివిజన్లోని సాహెబ్నగర్ కల్యాణ మండపం, సాగర్ కాంప్లెక్స్ కాలనీలో ఏర్పాటు చేసిన శిబిరాలను కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హాజరై పరిశీలించారు. బీఎన్రెడ్డినగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న కంటివెలుగు శిబిరాలను పరిశీలించారు.