Sameena Begum | మన్సూరాబాద్, ఫిబ్రవరి 4 : ఆర్టీసీ బస్సు కండక్టర్ను అసభ్య పదజాలంతో దూషించి దాడికి పాల్పడిన మహిళను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. జనవరి 25న ఉదయం హయత్నగర్ డిపో-1కు చెందిన ఆర్టీసీ బస్సు హయత్నగర్ నుంచి అఫ్జల్గంజ్కు బయలుదేరింది.
ఉదయం 5:30 గంటల సమయంలో ఎన్టీఆర్నగర్ మార్కెట్ ఎదురుగా ఉన్న సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వద్ద అంబర్పేటకు చెందిన సమీనాబేగం (28) బస్సు ఎక్కింది. మహిళ వద్ద ఐడీ ఫ్రూఫ్ లేకపోవడంతో కండక్టర్ వి.గంగాధర్ టికెట్ తీసుకోవాలని కోరగా.. వాగ్వివాదానికి దిగి కాలుతో తన్నుతూ చేయి చేసుకుంది. డిపో-1 మేనేజర్ జలగం విజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సమీనాబేగంను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.