మల్కాజిగిరి, అక్టోబర్ 24: రాష్ట్రంలోని కార్మిక సంఘాలన్ని బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాయని రాష్ట్ర కార్మిక విభాగం కార్యదర్శి సందీప్ సింగ్ అన్నారు. మంగళవారం బోయిన్పల్లిలోని పార్టీ కార్యాలయంలో మల్కాజిగిరి అసెంబ్లీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డితో సందీప్సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సందీప్సింగ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను అమలు పరుస్తామన్నారు.
నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతో చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు నిరంతరం పనిచేయడం వల్ల కార్మికులకు ఉపాధి దొరుకుతున్నదన్నారు. కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఆటో, డీసీఎం కార్యికులకు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ బీమా వర్తింపచేస్తుందన్నారు. అరుంధతి ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స అందజేస్తున్నారని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.