మేడ్చల్ రూరల్, జనవరి 25: నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని డబిల్పూర్లో రూ. 3.18 కోట్లతో బీటీ రోడ్డు పనులు , రాయిలాపూర్లో రూ.64 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి బుధవారం శంకుస్తాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గల్లీ, ప్రతి వీధిలో అభివృద్ధి చోటు చేసుకున్నదని తెలిపారు.
దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయానందరెడ్డి, సర్పంచులు గీతాభాగ్యారెడ్డి, నర్మదాగోపాల్రెడ్డి, జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్, ఎంపీడీవో పద్మావతి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దయాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, ఎంపీటీసీ అనూప శ్రీకాంత్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, నాయకులు రాజమల్లారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, భాగ్యారెడ్డి, అంతిరెడ్డి, సురేశ్రెడ్డి, రణదీప్రెడ్డి, అశోక్, రఘుపతిరెడ్డి, రవీందర్రెడ్డి, మల్లేశ్ పాల్గొన్నారు.