బాలానగర్, జనవరి 11: ప్రాణం ఉన్నంత వరకు కార్యకర్తలను మరువలేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నా రు. గురువారం బాలానగర్ డివిజన్ వినాయక్నగర్లోని కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాపై విశ్వాసంతో ప్రచారం చేసి నా గెలుపునకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో మొత్తం 418 బూత్లుండగా అన్నింటిలో మొదటి నుంచి ఆధిక్యత కనబరిచి గతంలో ఎప్పుడూలేని మెజార్టీతో గెలిపించి తాను హాట్రిక్ సాధించడానికి దోహదపడ్డారన్నారు. శాసనసభ ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్నా, లేక పోయినా పర్వాలేదు. ఎల్లప్పుడూ ప్రజల పక్ష మే అని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమ స్య వచ్చినా అండగా నిలబడి పరిష్కరిస్తానని తెలిపారు.
కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎలా చేస్తుందో పరిశీలించి తదుపరి నిర్ణయం జరుగుతుందన్నారు. ప్రజాసమస్యలే ప్రాధాన్యం.. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంతమేర అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసున్నారు. కూకట్పల్లి నియోజకవర్గం ప్రజల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు, బీసీబంధు పథకాలను పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు దర్శనం శాకయ్య, ప్రధాన కార్యదర్శి ఎండీ ఖాజా, సీనియర్ నాయకులు మందడి సుధాకర్రెడ్డి, దారం వెంకటేశం గుప్త, పంజా రాంచందర్ ముదిరాజ్, శ్రీనివాసరాజు, శ్రీనివాస్ ముదిరాజ్, బీఎన్ స్వామి, ప్రేంకుమార్, బాజిని నాగేందర్గౌడ్, ప్రభారెడ్డి, సులోచనరెడ్డి, కవిత, స్వాతి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.