బాలానగర్, జూన్ 6 : పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఫతేనగర్ పారిశ్రామికవాడలోని టీఎస్ఐఐసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రగతి కార్యక్రమానికి ఆయనతో పాటు ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐలా కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే స్వరాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో భాగంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంలో పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం బాటలు వేసిన తీరును పారిశ్రామిక వేత్తలకు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదన్నారు. పదేళ్ల కాలంలో ఇతర రంగాలతో పాటు పారిశ్రామిక రంగం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. ఇన్నోవేట్, ఇంక్యుబేట్ ఇన్ కార్పొరేట్ అనే నినాదంతో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు.
ప్రపంచానికి తెలంగాణ పారిశ్రామిక రంగం ఆదర్శంగా నిలువాలన్నదే ధ్యేయంగా టీఎస్ ఐపాస్ను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ప్రవేశ పెట్టడం హర్షణీయమన్నారు. నాడు పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే సంవత్సరాలు గడిచేదన్నారు. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిశ్రమల స్థాపనకు టీఎస్ ఐపాస్ ద్వారా కేవలం 15 రోజుల్లోనే అనుమతులు వస్తున్నాయని తెలిపారు. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వ విజయమని ప్రజలు విశ్వషిస్తున్నారని తెలిపారు. 9 ఏండ్లలో తెలంగాణ రాష్ర్టానికి 23 వేల పరిశ్రమల స్థాపన కారణంగా 17 లక్షల 77వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయని పేర్కొన్నారు. WE HUB ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తలకు పోత్సాహకాలు అందుతున్నాయని తెలిపారు. T HUB ద్వారా పారిశ్రామిక ప్రగతి సరళతరమైందన్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఎంఎస్ఎంఈ గ్రీన్ పార్క్లో 51 పరిశ్రమలను మంత్రి కేటీఆర్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. తద్వార గ్రామీణ యువతకు ఉపాధీ అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి మరో 50 పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరాలను అందించడంలో ప్రభుత్వం సఫలమైందన్నారు. కార్యక్రమంలో కూకట్పల్లి ఐలా కమిషనర్ విజయ, చైర్మన్ సూర్యరాజ్, డీసీలు రవీందర్కుమార్, రవీందర్, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
బీసీలకు ప్రభుత్వం అండ..
బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. మంగళవారం రూ.45 లక్షల నిధులతో శోభనకాలనీ దోబీఘాట్ అభివృద్ధి పనులకు కార్పొరేటర్ పండాల సతీవ్గౌడ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుల వృత్తులతో ఆధారపడి పని చేస్తున్న రజకులు, నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు. అర్హులైన వారందరికి ఒకరికి రూ.1లక్ష చొప్పున కుల వృత్తులపై ఆధారపడిన వారికి చేయూత అందిస్తుందన్నారు. డివిజన్కు 100 మంది చొప్పున కూకట్పల్లి నియోజకవర్గంలో బీసీలకు సహకారం అందించనున్నట్లు తెలిపారు. ఇంటి స్థలం ఉండి ఇళ్లు కట్టుకునే స్థోమతలేని వారికి సహకారం అందించడంలో ప్రభుఉత్వం రూ.3 లక్షలు ఆర్థిక సహాయం అందించనుందన్నారు. అర్ములైన వారందరూ ఆయా పథకాలకు ధరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భిక్షపతి, కన్నయ్య, బాలకృష్ణ, బాగయ్య, ఆనంద్, విజయ్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.