సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): నాగోల్ మూసీ పరీవాహక ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణను గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన నాగోల్ ఎస్టీపీని సందర్శించనున్నారు. 10.30 గంటలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన మూసీ ప్రాంతాన్ని సందర్శిస్తారు. అనంతరం 11.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఇండ్లు కూల్చకుండా, భూములు లాక్కోకుండా తక్కువ ఖర్చుతో మూసీని ఎలా సుందరీకరించవచ్చో వివరిస్తారు. మూసీ మురుగును పారదోలేందుకు చేపట్టే పనుల గురించి చెప్తారు. సాయంత్రం 6 గంటలకు మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్లో ఇఫ్తార్ విందుకు హాజరవుతారు.