KTR | హైదరాబాద్ బ్రాండ్గా నిలిచిన దుర్గం చెరువు పరిస్థితి అధ్వానంగా మారడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంటూ బిజీగా ఉందని.. ప్రస్తుత సిటీని కాలుష్యం, ఇతర సమస్యల నుంచి కాపాడటంపై దృష్టి పెట్టేందుకు సమయం లేదని ఎద్దేవా చేశారు. ప్రజెంట్ సిటీ ఇప్పుడు సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉందని తెలిపారు.
దుర్గం చెరువు ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన వీడియోను ‘ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా’ ఎక్స్ ఖాతా ద్వారా చేసిన పోస్టును కేటీఆర్ షేర్ చేశారు. చెరువు నీటి ఉపరితలంపై భారీగా చెత్త పేరుకుపోయిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. చెరువు పరిసరాలు కూడా చెత్తాచెదారంతో నిండిపోయినట్లు పోస్టులో పేర్కొన్నారు.
Congress Govt is busy building the imaginary “Future City”
No time for Present City – it’s under 22A https://t.co/hrceXiX8Uz
— KTR (@KTRBRS) September 5, 2026
ఈ దృశ్యాలను ప్రస్తావిస్తూ కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. “కాంగ్రెస్ ప్రభుత్వం ఊహాజనిత ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణంలో బిజీగా ఉంది. ‘ప్రజెంట్ సిటీ’కి మాత్రం సమయం లేదు.. అది 22ఏ కింద ఉంది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.