KTR | హైదరాబాద్ : ప్రధాని మోదీని ఆపాలంటే కేసీఆర్, కేజ్రీవాల్, మమతా బెనర్జీకే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మోదీని ఆపడం కాంగ్రెస్తో సాధ్యపడదు అని చెప్పారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేశారు. బీజేపోళ్లకు బీఆర్ఎస్ బీ టీం అని చెప్పి మైనార్టీ సోదరుల్లో విషం నింపే ప్రయత్నం చేశారు. కానీ హైదరాబాద్లో ఎవరూ నమ్మలేదు. బీఆర్ఎస్ను ముస్లింలు నమ్మారు. అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందాం అని కేటీఆర్ గుర్తు చేశారు.
కవితమ్మను అరెస్టు చేయలేదు అందుకు వారు ఒక్కటే అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెసోళ్లు అన్నారు. సుప్రీంకోర్టులో కేసు ఉండే, స్టే ఉండే కాబట్టి అరెస్టు చేయలేకపోతయారు. ఆ తర్వాత పగబట్టి ఇంటికి వచ్చి అరెస్టు చేశారు. కవితమ్మనే కాదు.. ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా అరెస్టు చేశారు. మోదీ మొత్తం ప్రతిపక్షాలను అరెస్టు చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ కాంగ్రెస్ దీనికి ఏం సమాధానం చెబుతది..? కేవలంగా బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు మాత్రమే మోదీని ఆపుతున్నారు. కాంగ్రెస్కు మోదీని అడ్డుకునే స్థాయి లేదు. మోదీని ఆపాలంటే కేసీఆర్, మమత, కేజ్రీవాల్ లాంటి నేతలతోనే సాధ్యం. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. సంస్థలను అడ్డం పెట్టుకొని బీజేపీ శిఖండి రాజకీయాలు చేస్తోంది. ఇప్పుడు ప్రమాదంలో ఉన్నది హిందువులు కాదు భారతదేశం అని కేటీఆర్ పేర్కొన్నారు.