Telangana Assembly Elections | మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి కేపీ వివేకానంద 42,614 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. 12 రౌండ్లు పూర్తయ్యే సరికి కేపీ వివేకానందకు 104325, కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంత్ రెడ్డికి 61711, బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్కు 54970 ఓట్లు పోలయ్యాయి. కేపీ వివేకానంద భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుండటంతో గులాబీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.