హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో కొండవీడు చిత్రబృందం మొక్కలు నాటింది. ఈ సందర్భంగా నటి శ్వేతా వర్మ, నిర్మాత ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని వారు పిలుపునిచ్చారు.