మాదాపూర్, ఏప్రిల్ 22 : రంగారెడ్డి జిల్లా మాస్టర్ అథ్లెట్లకు తగిన ప్రోత్సాహం అందజేస్తామని రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండా విజయ్కుమార్ అన్నారు. ఫిబ్రవరిలో హరియాణాలోని కురుక్షేత్రలో ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ మాస్టర్ అథ్లెట్లో తమదైన శైలిలో సత్తా చాటిన మాస్టర్లను శనివారం హుడా కాలనీలో సన్మానించడంతో పాటు వారికి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిలా ్లనుంచి జాతీయ పోటీల్లో పాల్గొని రాణించిన వారిలో మమత పాటి ఒక బంగారు పతకంతోపాటు నాలుగు పతకాలు, భవాని 3, ఏసురత్నం 2, డేవిడ్ రాజ్ 1 పతకం సాధించడంతో వారిని సన్మానించడం జరిగింది.
రానున్న రోజుల్లో నిర్వహించే జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిలో ఎక్కడ పోటీలు నిర్వహించినా మరిన్ని పతకాలు సాధించేలా అథ్లెట్లకు శిక్షణను అందిస్తామని రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండా విజయ్కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ నూనె సురేందర్, అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ శ్రీనివాస్ గౌడ్, ప్యాట్రన్ రెడ్డి ప్రవీణ్రెడ్డి, సభ్యులు ఏసు రత్నం, బాల్ రాజ్, శివలీల తదితరులు ఉన్నారు.