చర్లపల్లి, ఆగస్టు 15 : సెల్ ఫోన్ విషయంలో అక్కతో గొడవ పడిన చెల్లులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. చర్లపల్లి డివిజన్ చక్రీపురం, కట్టింగ్ కాలనీలో నివాసముండే యాదగిరి మేస్త్రీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోశిస్తున్నాడు.
ఇతడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కాగా ఇంట్లో ఒకే సెల్ఫోన్ ఉండటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన చెల్లెలు(17) ఇంట్లోకి వెళ్లి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.