హైదరాబాద్ : కూకట్పల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. శాతవాహననగర్లో గోడకూలడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో నీటి ట్యాంక్ గోడ కూలి శిథిలాలు మీదపడ్డాయి. తీవ్ర గాయాలు కావడంతో బాలుడు శరోన్ దీత్య (4) అక్కడికక్కడే మృతి చెందాడు. కండ్ల ఎదుటే చిన్నారి మృతి చెందడంతో కన్నతల్లి రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.