సిటీబ్యూరో, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ) : స్టడీ టూర్లో భాగంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీని(IICT) పలు కాలేజీ విద్యార్థులు సందర్శించారు. బుధవారం కేరళ (Kerala students) నుంచి వచ్చిన 16 మంది విద్యార్థుల బృందం.. ఐఐసీటీ క్యాంపస్ పరిధిలోని ల్యాబోరేటరీలను పరిశీలించారు. అదేవిధంగా వరంగల్కు(Warangal) చెందిన 45మంది కాలేజీ విద్యార్థులు ల్యాబోరేటరీని సందర్శించారు.
ఈ సందర్భంగా స్టడీ టూర్కు హాజరైన విద్యార్థులను ఉద్దేశించి సెమియో- కెమికల్, కెమికల్ ఇంజినీరింగ్, జెనిటిక్ కెమిస్ట్రీ ల్యాబ్లతోపాటు, బయో గ్యాస్ ప్లాంట్, మోల్ బ్యాంక్ ల్యాబోరేటరీలను విజిట్ చేశారు. కాగా, సందర్శనకు వచ్చిన విద్యార్థులకు ఐఐసీటీ పరిశోధన బృందం ప్రత్యేక కార్యక్రమాలతోపాటు, ల్యాబోరేటరీ ద్వారా అందించే సేవలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్యావకాశాలు, ఎమర్జింగ్ టెక్నాలజీతో కెమికల్ రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పిస్తూ ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు.