పీర్జాదిగూడ, నవంబర్ 17: హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మరోమారు హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ను గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞపి చేశారు.కాంగ్రెసోళ్ల మాయమాటలు నమ్మొద్దని,కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మేడ్చల్ నియోజక బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి ప్రజలను అభ్యర్థించారు. శుక్రవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు డివిజన్లలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకట్రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దర్గాదయాకర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లో ఐటీ పరిశ్రమలు, పార్కులు, వందల ఎకరాల్లో ఆక్సిజన్ పార్కులు ఏర్పాటు చేశామని, అనేక అభివృద్ధి కార్యక్రమాలకుచేపట్టి ప్రజలకు సౌలభ్యం చేశామని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో గత పాలనలో చేసిన అభివృద్ధి, ప్రస్తుతం నేను చేస్తున్న అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ ప్రభు త్వం ఏర్పడిన అనంతరం రూ. 400కే గ్యాస్సిలిండర్, రూ.15లక్షల వరకు ఆరోగ్యశ్రీ, 18 ఏండ్లు నిండిన మహిళలకు ప్రతినెల రూ.3వేలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారని వెల్లడించారు.
పీర్జాదిగూడలో హిందూ, ముస్లిం, క్రైస్తవులకు ఒకే చోట వైకుంఠ ధామం నిర్మించి కులమతబేదాలు లేకుండా ఏర్పాటు చేయడం రాష్ట్రంలో మొదటిదన్నారు.తాగునీరు, సాగునీరు 24 గంటల ఉచిత కరెంటును కల్పించిన ఘనత సీఎంకు దక్కుతుందన్నారు. మరోసారి ఆదరిస్తే అన్నిపాంతాలను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రజలకు భరో సా ఇచ్చారు. కారు గుర్తుకు ఓటు భారీమెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, పార్టీశ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.