కందుకూరు, అక్టోబర్ 1 : రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండల పరిధిలోని ఫార్మాసిటీ సమీపంలో 300 ఎకరాల్లో ఏర్పాటు చేసే మెడికల్ కళాశాలను ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చేసిన శంకుస్థాపనలో సబితా ఇంద్రారెడ్డి పాల్గొని స్వాగత ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రతి పక్షాలకు దిమ్మతిరిగే రీతిలో కేసీఆర్ పాలన ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనను చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువస్తారని వివరించారు. పాత రంగారెడ్డి జిల్లాలో 3 మెడికల్ కళాశాలలు ఏర్పాటు అయినట్లు తెలిపారు. గతంలో పట్టించుకోని బీజేపీ పార్టీ రాష్ట్రంపై ప్రేమ ఒలకబోస్తుందని ఎద్దేవా చేశారు.
వైద్యం కోసం ప్రజలు హరిగోస పడ్డారు
గత ప్రభుత్వాల హయాంలో ప్రజలు వైద్యం కోసం హరిగోస పడ్డారని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి తెలిపారు. మెడికల్ వైద్య కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు రాష్ట్రం గురించి అసలు పట్టించుకోలేదని వివరించారు. పేద ప్రజలకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడ్డారని వివరించారు. సీఎం కేసీఆర్ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రజలకు అందుబాటులోకి వైద్యం తీసుకవస్తున్నట్లు వివరించారు.
‘పాలమూరు’ ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలి : ఎంపీ రంజిత్రెడ్డి
కేంద్ర ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి కోరారు. మెడికల్ కళాశాల శంకుస్థానలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్ర మంత్రులు రాష్ర్టానికి రాజకీయం చేయడానికి వస్తున్నారన్నారు. మహబూబ్నగర్ వచ్చిన ప్రధాని మోదీ రాష్ట్రంలోనే ఉండి కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజ్టెలను చూసి కడుపు నిండితే ప్రాజెక్టుల విషయంలో మాట్లాడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలు అంటుందని, ఎన్ని పథకాలు తీసుకవచ్చినా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందు ఏమి చేయలేవని తెలిపారు. కేసీఆర్ విన్నింగ్ షాట్ కొట్టడం ఖాయమని చెప్పారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని లక్ష మోజార్టీతో గెలిపించాలని కోరారు. పసుపు బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. మంత్రి హరీశ్రావు 14 ఏండ్లపాటు రాష్ట్రం కోసం పడరాని పాట్లు పడ్డారని, అదేవిధంగా 9 ఏండ్ల నుంచి రాష్ట్రం అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు.
రాష్ర్టానికి బీజేపీ చేసేందిఏమి లేదు : ఎమ్మెల్యే కిషన్రెడ్డి
రాష్ర్టానికి బీజేపీ పార్టీ చేసిందేమి లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. మంత్రి హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని కోరారు. మెడికల్ కళాశాల రావడం అంత సులభం కాదని, సీఎం కేసీఆర్ పాలనకు కళాశాల రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మరింత సులభంగా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని వివరించారు.
అనితా హరినాథ్రెడ్డి, రంగారెడ్డి జిల్లాపత్ చైర్మన్ పర్సన్ప్రతి పక్షాలకు బుద్ధి చెప్పాలి : ఎమ్మెల్సీ మల్లేశ్
రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రతి పక్షాలు పగటి కలలు కంటున్నాయని ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశ్ ఎద్దేవా చేశారు. మెడికల్ కళాశాల శంకుస్థాపనలో పాల్గొని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్ర అబివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనను చూసి ప్రతి పక్షాలు భయపడుతున్నాయని వివరించారు. ఆ పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. తిరిగి ఆ పార్టీకి అధికారం ఇస్తే పాత రోజులు మళ్లీ వస్తామని వివరించారు.