ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 3 : బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి నరేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి భారీ క్రికెట్ టోర్నమెంట్ (కేసీఆర్ కప్ – 2024) ను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్హౌజ్లో బుధవారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ.50 వేలు, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.25 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు శిగ వెంకటేశ్గౌడ్, మల్లేశ్, సురేశ్, రాజు, చందు, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.