సిటీబ్యూరో, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ) : పుట్టినోళ్లే కాదంటే ఆ ముసలోళ్లకు పెద్దకొడుకైండు. అడుగు వేయలేని అభాగ్యులకు ఆసరాగా నిలిచిండు. కట్టుకున్నోడి కాలం చెడితే పెద్ద అన్న లెక్క అక్కున్న చేర్చుకున్నడు. రెక్కలు ముక్కలు చేసుకుంటూ బతుకీడుస్తున్న బీడీ కార్మికుల ఆడబిడ్డలకు పింఛన్లను అందించిండు. అన్నార్తులకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందించిన సీఎం కేసీఆర్ ఆ పింఛన్లను మరోసారి పెంచి.. వారి పాలిట దేవుడయ్యాడు. రూ. 200 ఉన్న పింఛన్ను పదేళ్లలో రూ. 2వేలకు పెంచిన సీఎం కేసీఆర్.. వచ్చే ఐదేళ్లలో మరో 3వేలు పెంచనున్నట్లుగా ప్రకటించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యుడే విలవిలలాడిపోతుంటే… అభాగ్యులకు ఆసరా పింఛన్తో అండగా నిలుస్తున్నాడని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 4,21,888 మంది లబ్ధిదారులు ఉండగా.. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో పింఛన్లు పెరిగాయని మురిసిపోతున్నారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, గీత, నేత కార్మికులతో పాటు, హెచ్ఐవీ, ఫైలేరియా, డయాలసిస్ పేషంట్లతో సహా, బీడీ కార్మికులు, టేకేదార్లకు సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పింఛన్లను మంజూరు చేస్తూ తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో రూ. 200 ఉన్న పింఛన్ను రూ. 800 పెంచిన కేసీఆర్… తొమ్మిదేండ్ల పాలనలో రెండు దఫాలు పెంచి ప్రస్తుతం రూ. 2,016 చొప్పున బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఆసరా పింఛన్లు మరోసారి పెంచనున్నారంటూ లబ్ధిదారులు మురిసిపోతున్నారు.
చాలా కాలం నుంచి నాకు పింఛన్ వస్తుంది. అప్పుడు రూ.30 వచ్చేది. కాంగ్రెస్ వచ్చినంక రూ.200 అయ్యింది. కేసీఆర్ రాగానే ఒక్కసారిగా వెయ్యి రూపాయలు చేసిండు. ఇప్పుడు రెండు వేలు వస్తున్నాయి. నా మందులు, ఖర్చుల కోసం ఎవరి నుంచి కూడా ఒక్క రూపాయి తీసుకుంటలేను. చాలా మంది మాటలు చెబుతారు. కేసీఆర్ సార్ లెక్క ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. కేసీఆర్ సార్ ఒక్కరే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కేసీఆర్ సారే మళ్లీ సీఎం అవుతారు.
సీఎం కేసీఆర్ సార్ ఆసరా పింఛన్లు ఇచ్చి నా లాంటి వాళ్లకు ఎంతో భరోసాను కల్పించారు. ప్రతి నెల బ్యాంకులో పింఛన్ డబ్బులు పడుతున్నాయి. ఆసరా పింఛన్ను పెంచనున్నామని సీఎం హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ సారుకు పేదల కష్టాలు తెలుసు. పింఛన్ డబ్బులిచ్చి ఆదుకుంటున్నారు. కేసీఆర్ సార్ గొప్ప నాయకుడు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ఒంటరి మహిళ పింఛన్ నన్ను ఆదుకుంటుంది. నా భర్త రాకేశ్ చనిపోయాడు. నాకు ఇద్దరు పిల్లలు. ఒక బాబు దివ్యాంగుడు, మరో బాబు ఇంటర్ చదువుతున్నాడు. కుటుంబ భారం మొత్తం నాపై పడింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు తెలంగాణ ప్రభుత్వం ఒంటరి మహిళ పింఛన్ ఇచ్చి ఆదుకుంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇంకా పింఛన్లు పెంచుతామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది.
దివ్యాంగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్ సార్. గతంలో ఏ ప్రభుత్వాలు దివ్యాంగులను పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పింఛన్ పెంచిన ఘనత సీఎం కేసీఆర్ సారుకే దక్కుతుంది. పింఛన్ రావడంతో ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. రూ. 5,016 పెంచుతాననడం సంతోషంగా ఉంది. ఈసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది.
సీఎం కేసీఆర్ పాలనలో ప్రతినెలా వస్తున్న ఆసరా పింఛన్ రూ.2వేలు మా కుటుంబానికి ఆసరాగా నిలిచింది. గత ప్రభుత్వాల పాలనలో మమ్మల్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పాలనలో పింఛన్ ఇచ్చి మా కుటుంబానికి కేసీఆర్ సార్ పెద్ద దిక్కులా ఆదుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీలో బీఆర్ఎస్ గెలుస్తుంది. మూడోసారి సీఎంగా కేసీఆర్ సార్ అవుతారు.
– బి.రమాదేవి, హయత్నగర్
సీఎం కేసీఆర్ ఆలోచనలు బాగున్నాయి. తెలంగాణలోని ప్రతి ఇంటికి పింఛన్ ఇచ్చి పెద్ద కొడుకుగా నిలిచాడు. సీఎం కేసీఆర్ సార్కు మహిళలంటే గౌరవం. అందుకే సీఎం అయ్యాక ఆయన ప్రవేశపెట్టిన ప్రతి స్కీమ్ మహిళలకు ఉపయోగపడేలా ఉన్నాయి. ఇప్పుడున్న పింఛన్లను పెంచుతామని చెప్పి మరింత భరోసా ఇచ్చారు. మా ఆశిస్సులు బీఆర్ఎస్ పార్టీకే ఉంటాయి. మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ సార్ సీఎం కావడం ఖాయం.
సీఎం కేసీఆర్ సార్ ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రజలందరికీ ఉపయోగపడేలా ఉంది. నాకు సీఎం కేసీఆర్ సార్ ఇచ్చే ఆసరా పింఛన్ ఎంతగానో ఉపయోగపడుతున్నది. గతంలో రూ.1,000 ఉన్న పింఛన్ను.. రూ. 2,016లకు పెంచారు. ఇప్పుడు రూ.3,000లు చేస్తానని ప్రకటించడం సంతోషంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు మేలు చేస్తున్నది. ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ సర్కారే వస్తుంది.
నాకు ఎలాంటి సంపాదన లేదు. కేసీఆర్ సర్కార్ ఇస్తున్న పింఛన్ డబ్బులతోనే కాలం వెల్లదీస్తున్నా. కూతుళ్ల ఇండ్లల్లో ఉంటున్నా. నా సొంత ఖర్చులకు ఎవ్వరినీ పైసలు అడగకుండా సీఎం కేసీఆర్ సార్ పెద్ద కొడుకులా పింఛన్ ఇస్తున్నారు. ఇటీవల పింఛన్ డబ్బులు పెంచుతామని చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ సర్కారే వస్తుంది. కేసీఆర్ సార్ సీఎం అవుతారు.
మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు ఎంతో రుణపడి ఉంటాం. గతంలో రూ. 200 ఉన్న పింఛన్ను రూ. 500, రూ1500, రూ. 3000, రూ.4 వేల నుంచి ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రకటనతో రూ. 6 వేలు కానున్నది. ఇచ్చిన మాటను కేసీఆర్ సార్ నిలబెట్టుకుంటారు. ఆసరా పింఛన్ నా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచింది.
సీఎం కేసీఆర్ సార్ ప్రతి ఇంటికి పెద్ద దిక్కుగా నిలబడి ఎన్నో పథకాలు తెచ్చాడు. పింఛన్లు ఇచ్చి ఒకరి ముందు చేయి చాచకుండా ఆత్మగౌరవంతో బతికేలా చేశాడు. ఈ వయస్సులో కూడా సంతోషంగా ఉన్నామంటే కేసీఆర్ సార్ ఇస్తున్న పింఛనే కారణం. రాష్ట్రంలో కేసీఆర్ను మించిన నాయకుడు లేడు. ఆయన మేలు ఎప్పటికీ మరిచిపోము.
సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా వృద్ధాప్య పింఛన్ల పెంపు గొప్ప విషయం. కొడుకులు, కూతుళ్లు చూడకున్నా.. పింఛన్ డబ్బులతో బతుకుతున్నాం దేశంలో ఏ గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. సీఎం కేసీఆర్ పేదల గుండెల్లో నిలిచిపోతారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది. కేసీఆర్ సార్ సీఎం అవుతారు.
దివ్వాంగులకు నాలుగు వేల రూపాయల పింఛన్ ఇవ్వడం సంతోషంగా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి రూ. 3,000 ఉన్న పింఛన్ను రూ.4000కు పెంచారు. ఉన్నత చదువులు చదువుకున్న దివ్వాంగులను గుర్తించి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరాము. సీఎం కేసీఆర్ సార్ చేస్తారన్న నమ్మకం ఉన్నది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీలో గెలుస్తుంది.