హైదరాబాద్ : నగరంలోని కాసు బ్రహ్మానందరెడ్డి( KBR ) పార్కు ఎంట్రీ ఫీజులను పెంచారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన ఫీజులు అమల్లోకి రానున్నాయి. ఇయర్ పాస్(జనరల్) ఫీజును రూ. 2,500లకు పెంచగా(ప్రస్తుతం రూ. 2,250), సీనియర్ సిటీజన్ ఇయర్ పాస్ ఫీజును రూ. 1700(ప్రస్తుతం రూ. 1500)లకు, మంత్లీ పాస్ ఫీజును రూ. 700(ప్రస్తుతం రూ. 600)లకు పెంచారు.
అలాగే రోజు వారి ప్రవేశ రుసుమును పెద్దలకు రూ. 40, పిల్లలకు రూ. 25 వసూలు చేయనున్నారు. జనవరి 1 నుంచి పార్కు వేళల సమయాన్ని కూడా కుదించనున్నారు. ఉదయం 5 నుంచి 9:30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే వాకింగ్కు, సందర్శనకు అనుమతి ఉంటుంది. ఇక పాస్లను ఆన్లైన్లో రెన్యూవల్ చేసుకోవాలి అని నిర్వాహకులు సూచించారు.