కాప్రా, ఫిబ్రవరి 24: కాప్రాసర్కిల్లోని కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, హెచ్బీకాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఏడు కంటి వెలుగు కేంద్రాల్లో శుక్రవారం మొత్తం 800 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. 1887 కుటుంబాల నుంచి 800 మంది కంటిపరీక్షలకు హాజరు కాగా, 266 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. 42 మందికి కండ్లద్దాలకు సంబంధించి , 60 మందికి శస్త్రచికిత్సలకు సంబంధించి వేరే దవాఖానలకు రిఫర్ చేశారు.
కాప్రా సర్కిల్లోని ఏడు కంటివెలుగు శిబిరాల్లో ఇప్పటి వరకు నిర్వహించిన 26 పనిదినాల్లో మొత్తం 52,720 కుటుంబాల నుంచి 21,810 మంది కంటిపరీక్షల కొరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో 9,120 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. కండ్లద్దాలకు సంబంధించి 2,214 మందిని, శస్త్రచికిత్సలకు సంబంధించి 1,631 మందిని వేరే దవాఖానలకు రిఫర్ చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.