ఎల్బీనగర్, డిసెంబర్ 14 : తెలంగాణ ప్రభుత్వం జనవరి 18 నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎల్బీనగర్ జోన్లోని హయత్నగర్, ఎల్బీనగర్, సరూర్నగర్ సర్కిళ్ల పరిధిలోని డివిజన్ల వారీగా కంటి వెలుగు శిబిరాలను గుర్తించారు. ఒక్కో డివిజన్లో రెండు కంటి వెలుగు పరీక్షా కేంద్రాలను గుర్తించిన అధికారులు.. తొలి దశలో ఒక కేంద్రంలో, రెండో దశలో మరో కేంద్రంలో కంటి వెలుగు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హయత్నగర్ సర్కిల్లోని నాలుగు డివిజన్లకు గానూ నాలుగు టీమ్లు, ఎల్బీనగర్ సర్కిల్లోని నాలుగు డివిజన్లకు గానూ నాలుగు టీమ్లు, సరూర్నగర్ సర్కిల్లోని ఐదు డివిజన్లకు గానూ ఐదు టీమ్లు కంటి వెలుగు పరీక్షా కేంద్రాల ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. రీడింగ్ సమస్యలు ఉన్న వారికి వెంటనే కంటి అద్దాలను కూడా అందజేస్తారు. కంటి వెలుగు పథకం ద్వారా ప్రతి వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
ఎల్బీనగర్ సర్కిల్లోని పరీక్షా కేంద్రాలు..
ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని నాలుగు డివిజన్ల పరిధిలో కంటి వెలుగు పరీక్ష కేంద్రాలను నిర్వహించేందుకు డివిజన్కు రెండు కేంద్రాలను ఎంపిక చేసినట్లు ఉప కమిషనర్ సురేందర్రెడ్డి తెలిపారు. అయితే ఒక కేంద్రంలో 52 రోజులకు తగ్గకుండా 60 రోజులకు మించకుండా పరీక్షలు నిర్వహించిన తర్వాతే రెండో కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
హయత్నగర్ సర్కిల్ పరిధిలో..
హయత్నగర్ సర్కిల్లోని నాలుగు డివిజన్లలో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు సర్కిల్ ఉప కమిషనర్ మారుతీ దివాకర్ తెలిపారు. కేంద్రాల వివరాలు వెల్లడించారు.
నాగోలు డివిజన్లోని అంధుల కాలనీ దివ్యాంగుల కమ్యూనిటీ హాల్లో, అనంతరం నాగోలు సాయినగర్ మోడల్ మార్కెట్లో శిబిరం ఉంటుంది.
మన్సూరాబాద్ డివిజన్లోని భవానీనగర్ కమ్యూనిటీ హాల్లో, అనంతరం వినాయక్నగర్ కమ్యూనిటీ హాల్లో..
హయత్నగర్ డివిజన్లోని హయత్నగర్ వార్డు కార్యాలయంలో, అనంతరం కమలానగర్ కమ్యూనిటీ హాల్లో..
బీఎన్రెడ్డినగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్నగర్ కల్యాణ మండపంలో, అదే విధంగా సాగర్ కాంప్లెక్స్ కమ్యూనిటీ హాల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తారు.
ఎల్బీనగర్ సర్కిల్లో కేంద్రాలు..
వనస్థలిపురం డివిజన్లోని ప్రశాంత్నగర్ కమ్యూనిటీ హాల్లో, నాగార్జున కాలనీ కమ్యూనిటీ హాల్లో పరీక్షలు చేస్తారు.
హస్తినాపురం డివిజన్లో ఆచార్య పద్మపాణి కమ్యూనిటీ హాల్లో, అనంతరం నందనవనం బస్తీ దావఖానలో..
చంపాపేట డివిజన్లో చంపాపేట మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్, అనంతరం శుభోదయ కాలనీ కమ్యూనిటీ హాల్లో..
లింగోజిగూడ డివిజన్లో ఎల్బీనగర్ ఎస్బీహెచ్ కాలనీ ఫేజ్-3 కాలనీ కమ్యూనిటీ హాల్, అనంతరం జానకీ ఎన్క్లేవ్ కమ్యూనిటీ హాల్లో..
సరూర్నగర్ సర్కిల్ పరిధిలో..
సర్కిల్ పరిధిలోని ఐదు డివిజన్ల పరిధిలో కంటి వెలుగు పరీక్షల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని. ఉప కమిషనర్ హరి కృష్ణయ్య తెలిపారు. కేంద్రాల వివరాలు వెల్లడించారు.
సరూర్నగర్ డివిజన్ పరిధిలో సరూర్నగర్ వార్డు కార్యాలయంలో, అనంతరం డాక్టర్స్ కాలనీ సీనియర్ సిటిజన్స్ కమ్యూనిటీ హాల్లో..
ఆర్కేపురం డివిజన్లో కృష్ణానగర్ కమ్యూనిటీ హాల్, హరిపురి కాలనీ కమ్యూనిటీ హాల్లో..
చైతన్యపురి డివిజన్లో న్యూ మారుతీనగర్ కమ్యూనిటీ హాల్, అనంతరం చైతన్యపురి సీనియర్ సిటిజన్ కమ్యూనిటీ హాల్లో..
గడ్డిఅన్నారం డివిజన్లో కోదండరాంనగర్ కమ్యూనిటీ హాల్లో, అనంతరం ప్రగతినగర్ కమ్యూనిటీ హాల్లో..
కొత్తపేట డివిజన్లో కొత్తపేట మహిళా భవన్లో, అనంతరం శృంగేరీ కాలనీ కమ్యూనిటీ హాల్లో..