డాక్టర్ గాయత్రి కామినేని
ఆబిడ్స్. జూన్ 6: అలెర్జీ సంబంధిత వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని కామినేని హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ గాయత్రి కామినేని సూచించారు. కింగ్కోఠి కామినేని దవఖానలో అంతర్జాతీయ అలెర్జీ వారోత్సవాలలో భాగంగా సోమవారం దవాఖానలో నూతనంగా నెలకొల్పిన అలర్జీ, ఇమ్యూనాలజీ విభాగాన్ని డాక్టర్ గాయత్రి కామినేని ప్రారంభించారు.
అనంతరం, ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ దేశంలోని ప్రాణాంతక నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులలో అలెర్జీ ఒకటి అన్నారు. సుమారు 30 కోట్ల మంది భారతీయులు వివిధ రకాల అలెర్జీలతో బాధపడుతున్నారని వెల్లడించారు. అలర్జీ, ఇమ్యూనోలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి తరువాత అలెర్జీల ప్రభావం విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. అత్యుత్తమ చికిత్స అందించాలనే లక్ష్యంతో నూతనంగా ఈ విభాగాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. కింగ్కోఠి కామినేని హాస్పిటల్ శాఖ సీవోవో డాక్టర్ ఆదిత్య పాల్గొన్నారు.