హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టడం గొప్ప నిర్ణయం అని సంగీత దర్శకుడు కల్యాణ్ మాలిక్ కొనియాడారు.
గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విసిరిన చాలెంజ్ను స్వీకరించి జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కల్యాణ్ మాలిక్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని ఆయన కోరారు.
అనంతరం సింగర్ చిన్మయి, లిరిక్ రైటర్ లక్ష్మీ భూపాల్, మ్యూజిక్ డైరెక్టర్ స్వర సాగర్ మహతి ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. కార్యక్రమ అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని కల్యాణ్ మాలిక్కు బహుకరించారు.