మేడ్చల్, జోన్ బృందం, ఏప్రిల్ 11: జ్యోతి ఫూలే జయంతి మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి, విగ్రహాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దీన జనోద్ధరణకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. మహిళా విద్యకు ప్రాధాన్యతనిచ్చారని ప్రశంసించారు. ఆయన చూపిన బాట అందరికీ అనుసరణీయమన్నారు.
జవహర్నగర్లోని అంబేద్కర్ చౌరస్తాలో మహనీయుల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సురేందర్ ఆధ్వర్యంలో ఫూలే జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య పాల్గొని, మాట్లాడారు. ఆంగ్ల మాధ్యమ విద్యతో ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశం ఉంటుందని, జ్యోతిరావు ఫూలే విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. అం టరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్యను అందించాలని, విద్య ద్వారానే బలహీనవర్గాలు, సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు.
కార్యక్రమంలో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ డిప్యూటీశ్రీనివాస్, కమిషనర్ రామలింగం, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఆర్వో ప్రభాకర్ యాదవ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్రెడ్డి, ఎస్సైలు నాగరాజు గౌడ్, అనిల్కుమార్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఫూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక చెక్పోస్టు వద్ద ఉన్న ఫూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కమిషనర్ రాములు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఫూలే విగ్రహానికి మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్రెడ్డితో పాటు కమిషనర్ రాములు, కౌన్సిలర్లు మల్లికార్జున్ ముదిరాజ్, సాయిపేట శ్రీనివాస్ యాదవ్, బాల్రాజ్, పెంటయ్య, జైపాల్రెడ్డి, హేమంత్రెడ్డి, కోఆప్షన్ సభ్యులు దేవేందర్, మాజీ సర్పం చ్ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీటీసీ మోహన్రెడ్డి, నాయకులు యాదగిరి, సంజీవగౌడ్, జనార్దన్రెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.
అదే విధంగా మున్సిపల్ పరిధిలోని కండ్లకోయలో పూలే విగ్రహానికి అగ్రికల్చర్ సొసైటీ వైస్ చైర్మన్ నరహరి, నాయకులు శశిధర్రెడ్డి, కృష్ణారెడ్డి, పెంటయ్య, రాజేందర్, ప్రవీణ్ కుమార్, సందీప్, హరిబాబు, గోపాలకృష్ణ, హరిబాబు, హరికృష్ణ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఘట్కేసర్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్పర్సన్ పావనీ జంగయ్య యాదవ్, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్యాదగిరి యాదవ్, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.