ప్రతి ఐదేండ్లకు ఓసారి రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగనున్న జూబ్లీహిల్స్ కో-ఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రా ష్ట్ర సహకార శాఖ ఎలక్షన్ అథారిటీ అడిషనల్ రిజిస్ట్రార్ ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నెల 5న సొసై టీ ఎన్నికల అధికారి ఎలక్షన్ నోటీసును (ఫాం-1) జారీ చేయనుండగా, 9,10, 12వ తేదీలలో నామినేషన్లను స్వీకరించనున్నారు. 13న నామినేషన్ల పరిశీల న జరుగుతుందని, 14న నామినేషన్ల ఉపసంహరణతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నా రు. అలాగే, మార్చి 21న పోలింగ్ నిర్వహించడంతో పాటు అదేరోజున ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజుల్లోను గెలిచిన అభ్యర్థులు బాధ్యతలు స్వీకరించనున్నారు. పోలింగ్ను మాత్రం జూబ్లీహిల్స్ రోడ్ నెం: 71లో ని భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూ ల్లో నిర్వహించనున్నారు.
15 మంది సభ్యులు…
జూబ్లీహిల్స్ కో-ఆపరేటీవ్ హౌస్ బి ల్డింగ్ సొసైటీ కమిటీలో సుమారు 15 మంది సభ్యులుంటారు. ఇందులో ఎ స్సీ, ఎస్టీ కేటగిరిలో ఒకరు, మహిళా కేటగిరిలో ఇద్దరు, జనరల్ కేటగిరిలో 12మంది సభ్యులుంటారు. అలాగే, బ్యాలెట్ పేపర్లు కూడా కేటగిరీల వారీ గా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ కేటగిరి స భ్యుల బ్యాలెట్ లైట్ బ్లూకలర్ కాగా, మహిళా కేటగిరిలో పొటీపడే అభ్యర్థుల బ్యాలెట్ లైట్పింక్, ఓపెన్ కేటగిరి అభ్యర్థుల బ్యాలెట్ వైట్ కలర్లో ఉంటుంది.
మూడు దఫాలుగా వాళ్లే…
ఐదేండ్లకు ఓసారి జూబ్లీహిల్స్ కో-ఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు జరుగుతాయి. అయితే, 2000లో ఎన్నికలు కొంత వరకు పారదర్శకంగా జరిగినా, ఆ తరువాత 2005, 2010, 2015లో నిర్వహించిన ఎన్నికలలో చ క్రం తిప్పిన ఒకరిద్దరు వ్యక్తులు సొసైటీని దాదాపుగా 15ఏండ్ల పాటు తమ గుప్పిట్లో పెట్టుకున్నారనే ఆరోపణలు న్నాయి. ఈ మూడు దఫాలుగా కూడా ఓ టీవీ చానల్ అధినేత అధ్యక్షుడిగా కొనసాగగా, 2005లో, 2010లో నల్లగొండ మాజీ డీసీసీ అధ్యక్షలు తూడి దే వేందర్ రెడ్డి జనరల్ సెక్రటరీగా, 2015 లో మాత్రం జనరల్ సెక్రటరీగా హన్మంతరావు కొనసాగారు.
ఒక సభ్యుడు రెండుసార్లే…
సొసైటీ బైలాస్ ప్రకారం, ఒక సభ్యు డు రెండు దఫాలుగా మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి. కానీ, వాళ్లకు న్న పలుకుబడిని ఉపయోగించి మూడో దఫా కూడా పోటీ చేసి కమిటీలో చేరేందుకు పావులు కదుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకా రం, ఏం జరగనుందో వేచి చూద్దాం.
సెప్టెంబర్లోనే జరగాలి…
వాస్తవానికి 2015లో ఎన్నికైన స భ్యుల పదవీ కాలం గతంలోనే ముగిసింది. అయితే, 2020 సెప్టెంబర్లోనే ఎన్నికలు జరగాలి. కానీ, కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా అమలు చేసిన పలు నిబంధనలు, ఆ సభ్యుల పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించారు. దీంతో 2021 మార్చిలో సొసైటీ ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు.
ఓటర్లందరూ.. బడా బాబులే
సొసైటీ సభ్యులను ఎన్నుకునే ఓటర్లంతా బడా బాబులే కావడం విశేషం. సుమారు 3,500 మంది ఓటర్లుండగా, వీరిలో మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎ మ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ లు, బిలియనీర్లు, బడా వ్యాపారులు, మీడియా సంస్థల అధిపతులు ఇందు లో ఓటర్లుగా ఉన్నారు.