హైదరాబాద్ : నగరంలోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని చెస్ట్ హాస్పిటల్ స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కార్పొరేటర్లు శుక్రవారం సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియొద్దీన్, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య, యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, రహ్మత్ నగర్ కార్పొరేటర్ సీఎన్. రెడ్డి, సోమాజీగూడ కార్పొరేటర్ సంగీతా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.