ఎర్రగడ్డ, అక్టోబర్ 30: ఎర్రగడ్డలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం విజయోత్సవ సభను తలపించింది. పార్టీ అభ్యర్థి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ డివిజన్లో ఉదయం రోడ్డుషో, సాయంత్రం ఇంటింటి ప్రచారం నిర్వహించగా అనూహ్య స్పందన ల భించింది. అడుగడుగునా స్థానికులు మాగంటికి స్వాగ తం పలుకగా.. మహిళలు మంగళ హారతులు పట్టారు. అధిక సంఖ్యలో గులాబీ కార్యకర్తలు గోపీనాథ్ వెంట సైన్యంలా ముందుకుకదిలారు. శాస్త్రీనగర్, న్యూ శాస్త్రీనగర్, హేమవతినగర్, డాన్బాస్కో తదితర ప్రాంతాల మీదుగా రోడ్డుషో కొనసాగింది. ఇక కల్యాణ్నగర్ వెంచర్-3 కాలనీ, సారథినగర్, ప్రభాత్నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారంలో మాగంటి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ .. ఎర్రగడ్డ డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టామని, ఈ ఎన్ని కల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించండి.. మున్ముందు ఎర్రగడ్డను మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం అని పేర్కొన్నారు. బస్తీలు, కాలనీలు అనే తేడా లేకుండా అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నానని అన్నారు.
గతంలో కాంగ్రెస్ హయాంలో చేసింది శూన్యమని.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదని అన్నారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసు చేసుకుని అన్ని వర్గాల సంక్షేమానికి అండగా ఉంటున్నారని.. మనమంతా ఆయనను హ్యాట్రిక్ సీఎంగా చూడాలని పిలుపు నిచ్చారు. ప్రచారంలో డివిజన్ అధ్యక్షుడు సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ఖురేషీ, పల్లవియాదవ్, మహ్మద్అహ్మద్, కల్యాణి, యాదగిరి, దాసి శ్రీకాంత్, బాలమణి, దారాసింగ్ తదితరులు పాల్గొన్నారు.