సిటీబ్యూరో , ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ)/ కొండాపూర్ : ఎదిగే అవకాశాలకు నోచుకోని యువతలో సిల్ డెవలప్మెంట్ను వృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు, సొంత వ్యాపారం చేసుకునే అవకాశాలు పెంచడానికి లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ కృషి చేస్తుందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. చందానగర్లోని మోడల్ మారెట్ భవనంలో జీహెచ్ఎంసీ, లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డిలతో కలిసి మేయర్ సోమవారం ప్రారంభించారు. యువత వాళ్ల కాళ్ల పై వాళ్లు నిలబడి జీవన శైలిని అభివృద్ధి చేసుకునేందుకు జీహెచ్ఎంసీ లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్తో ఒప్పందం చేసుకున్నదని తెలిపారు.
జీహెచ్ఎంసీ యూసీడీ విభాగం ద్వారా తకువ ఆదాయం కలిగిన నగరవాసులు నివసించే ప్రాంతాలను పాపిరెడ్డి కాలనీ, శాంతినగర్, వేముకుంట, గోపీనగర్లలో విసృ్తత అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఈ సంస్థలో ఎన్రోల్ చేస్తారని మేయర్ పేర్కొన్నారు. ఈ శిక్షణలో మహిళలు ఎకవ సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సంస్థ ద్వారా టైలరింగ్, బ్యూటీషియన్, రిటైల్ రంగాల్లో, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యునికేషన్ సిల్స్ 18 నుంచి 35 ఏండ్లలోపు యువతీ, యువకులకు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం 500 మందికి శిక్షణ అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన 150 మందికి శిక్షణ నిస్తున్నారన్నారు. ఇందులో 36 మందికి ఉద్యోగాలు పొందారని నెలకు 15 వేల వరకు సంపాదిస్తున్నారని చెప్పారు. వీరిని ఆదర్శంగా తీసుకొని పరిసర ప్రాంతాల యువత ముందుకు రావాలన్నారు. శిక్షణ మధ్యలో ఆపకుండా సర్టిఫికెట్ పొందే వరకు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పూజితాజగదీశ్వర్, మంజుల రఘునాథ్, శ్రీకాంత్, యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య, జోనల్ కమిషనర్ శంకరయ్య, యూసీడీ జాయింట్ కమిషనర్ వెంకట్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ వెంకన్న, ఈఈ శ్రీకాంత్, సిల్ మేనేజర్ శ్రీధర్, డీపీఓలు మాధవి పాల్గొన్నారు.
యువత సద్వినియోగం చేసుకోవాలి: డిప్యూటీ మేయర్
లైట్ హౌస్ ఫౌండేషన్ అందిస్తున్న పలు కోర్సులను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి సూచించారు. ఈ సంస్థ విద్యార్థులకు కావాల్సిన సిల్స్, టూల్స్ శిక్షణ అందిస్తారని చెప్పారు. వారి సామర్థ్యానికి అనుగుణంగా తగిన కోర్సుల్లో శిక్షణను మేనేజర్లు అందిస్తారని పేర్కొన్నారు.
స్వశక్తితో ఎదగాలి: ఎమ్మెల్యే
లైట్ హౌస్ చేపడుతున్న కార్యక్రమం గొప్పదని, ప్రతి ఒకరూ స్వశక్తితో ఎదగాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఈ సంస్థ ద్వారా యువతీ, యువకులకు వ్యాపారంలోని మెలకువలు, పర్సనాలిటీ డెవలప్మెంట్, డిజిటల్ యాప్ పై విసృ్తతంగా అవగాహన కల్పిస్తారని చెప్పారు. ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వారికి కావాల్సిన స్పోకెన్ ఇంగ్లిష్, కెరీర్ కౌన్సిల్, ఉపాధి అవకాశాలను ఈ సంస్థ కల్పిస్తుందని పేర్కొన్నారు. యువత కష్టపడి క్రమశిక్షణ, విద్య ద్వారా గొప్ప అవకాశాలను పొందాలని సూచించారు.
13 లక్షల మంది యువతకు లబ్ధి : లైట్ హౌస్ సీఈవో
లైట్ హౌస్ ద్వారా యువతలో భయాన్ని పోగొట్టి మంచి కెరియర్ ఎంపికలో ప్రోత్సాహం, శిక్షణ అందిస్తున్నామని లైట్హౌజ్ సీఈవో రుచి తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ ద్వారా జీహెచ్ఎంసీ ప్రిన్సిపల్ గ్లోబల్ సర్వీసెస్, లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ ద్వారా పని చేస్తుందని చెప్పారు. ఈ సంస్థ ద్వారా దేశ వ్యాప్తంగా 1.3 లక్షల మంది యువత లబ్ధి పొందారని తెలిపారు. లైట్ హౌస్ పార్టనర్ ప్రిన్సిపల్ గ్లోబల్ సర్వీసెస్ నేహ దోస్తలే మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా యువతకు క్రమశిక్షణతో పాటు సిల్ డెవలప్మెంట్ నేర్పిస్తామని తెలిపారు. అనంతరం మేయర్, లైట్ హౌస్ సీఈవో రుచి, ప్రిన్సిపల్ గ్లోబల్ సర్వీసెస్ నెహా దోస్తలేను సన్మానించారు.