ఉస్మానియా యూనివర్సిటీ, మే 8: భారత వాయుసేనలో యువతకు అద్భుత అవకాశాలు ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని వింగ్ కమాండర్ నీరజ్ మిశ్రా పిలుపునిచ్చారు. కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ ఆధ్వర్యంలో సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో వాయుసేనలో కెరీర్ అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీరజ్ మిశ్రా హాజరై మాట్లాడారు. వాయుసేనలో దక్షిణాది నుంచి తక్కువగా ఉంటారని, ఎక్కువగా ఉత్తరాదివారే చేరుతారని చెప్పారు. దక్షిణాది యువతకు వాయుసేనకు సంబంధించిన భర్తీ ప్రక్రియ, నోటిఫికేషన్ విడుదల వంటివి తెలియకపోవడమే కారణమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాములు, కామర్స్ విభాగం హెడ్ ప్రొఫెసర్ చెన్నప్ప, ప్రొఫెసర్లు నాగేశ్వర్రావు, స్మిత, ప్యాట్రిక్, డాక్టర్ విద్యాసాగర్రావు, డాక్టర్ సంధ్య, డాక్టర్ సమున్నత పాల్గొన్నారు.