హైదరాబాద్ : నిరుద్యోగులకు శుభవార్త. ఐటీతో పాటు ఇతర కంపెనీల్లో ఉద్యోగాల దక్కన్ బ్లాస్టర్స్ ఈ నెల 5వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నారు. మాసాబ్ట్యాంక్ పరిధిలోని ఖాజా మాన్సన్ ఫంక్షన్ హాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్యూబెక్ ఓవర్సీస్, ఏఎస్ఎం ఇన్ఫ్రా ప్రాపర్టీస్, డెవలపర్స్ ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహిస్తున్నారు.
జాబ్ మేళాలో హాస్పిటాలిటీ, టెలికాం సెక్టార్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఐటీ, ఐఈఎల్టీఎస్, సెక్యూరిటీ సంస్థలు, బ్యాంకులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అర్హులైన అభ్యర్థలు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో జాబ్మేళాకు హాజరు కావొచ్చు. తదితర వివరాల కోసం 8374315052 ఫోన్ నంబర్లో సంప్రదించొచ్చు.