హైదరాబాద్ : రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం ఈఈ జగజ్యోతిని(Jagajyothi) ఉస్మానియా దవాఖాను( Osmania Hospital) నుంచి డిశ్చార్జ్(discharged) చేశారు. మరికొద్ది సేపట్లో ఏసీబీ(ACB) అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచున్నారు. కాగా, రూ. 84 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇంట్లో సోదాలు చేసే సమయంలో ఆమె ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 65 లక్షల నగదు, 4 కిలోల బంగారం ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.