షాబాద్/మొయినాబాద్/వికారాబాద్ , నవంబర్ 16 : చేవెళ్ల ప్రాంత ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారమే 111 జీవోను ఎత్తివేశామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నా రు. గురువారం ఆయన బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, వికారాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్కు మద్దతుగా మొయినాబాద్ మండల కేంద్రంతో పాటు వికారాబాద్ నియోజకవర్గంలోని వికారాబాద్ పట్టణం, మర్పల్లి మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్షోలో మంత్రి పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి కార్తిక్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రి కేటీఆర్కు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రోడ్షోలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని ప్రజలు రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తే సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పనులను పూర్తి చేసుకున్న ట్లు గుర్తు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్తును అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. రైతుబంధు పథకంతో పెట్టుబడిసాయా న్ని అందిస్తున్నది తెలంగాణ మాత్రమేనని.. ఇప్పటికే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లను సీఎం కేసీఆర్ జమ చేసినట్లు ఆయన వివరించారు. రైతుబీమాతో బాధిత రైతు కుటుంబాలకు బీ ఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటున్నదన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు వివిధ రకాల సంక్షే మ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నట్లు తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 111 జీవోను ఎత్తి వేసినట్లు.. కొన్ని న్యాయపరమైన చిక్కులున్నాయని వాటిని సవరించుకుంటూ ప్రజలకు మేలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో శంకర్పల్లికి రైల్వేకోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని, షాబాద్ మండలంలోని చందనవెల్లి, సీతారాంపూర్లలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలు ఏర్పాటవుతుండడంతో స్థానిక యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితులైన శాసనసభ్యుల్లో ఒకరని, ఆయనకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
వికారాబాద్ అప్పుడెట్లుండే..
2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్ ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించి ఓటేయాలని ప్రజలకు సూచించారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత వికారాబాద్ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడంతోపాటు వికారాబాద్లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, ప్రభుత్వ మెడికల్, న ర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుతో అనుబంధంగా 500 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. మోమిన్పేట సమీపంలోని ఎన్కతల, అర్కతలలో భారీ ఎత్తు న పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు. అదేవిధంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మహబూబ్నగర్లో సీఎం కేసీఆర్ ప్రారంభించారని, ఏడాదిలోగా కృష్ణా జలాలను వికారాబాద్ నియోజకవర్గానికి తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. మర్పల్లి-మోమిన్పేట నాలుగు లేన్ల రోడ్డుకు రూ.12 కోట్లు మంజూరు చేసి మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే త్వరగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మర్పల్లి మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణానికి నిధులను మంజూరు చేస్తామన్నారు.
మరోసారి అవకాశమివ్వండి..
ఇప్పటికే రెండుసార్లు అవకాశమిచ్చారు.. మరోసారి అవకాశమిస్తే మరింత సేవ చేస్తా. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇంటింటికీ మిష న్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నది. అంతేకాకుండా ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నది. సీఎం కేసీఆర్, మంత్రి రామన్న సహకారంతో షాబాద్ మం డలంలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలు ఏర్పాటయ్యాయి. మంత్రులు సబితారెడ్డి, మహేందర్రెడ్డి సహకారంతో సీతారాంపూర్, చందనవెల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కంపెనీలను తీసుకొచ్చా. నవాబుపే ట మండలంలో ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం లో ఉన్నది. 84 గ్రామాలకు గుదిబండలా ఉన్న 111 జీవోను ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తివేయడం సంతోషకరం. సంక్షేమ పథకాలు సజావుగా కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలి. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మూడోసారి సీఎంగా కేసీఆర్ను, చేవెళ్ల నుంచి ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలి.
– ఎమ్మెల్యే కాలె యాదయ్య, బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థి
గెలిచిన నాటి నుంచి మీతోనే ఉన్నా..
మర్పల్లి, మోమిన్పేట, బంట్వారం మండలాల నుంచి తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులను చూస్తూంటే కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా అవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది. వికారాబాద్లో ప్ర భుత్వ జూనియర్, డిగ్రీ, మెడికల్ కాలేజీలతోపాటు ఆయుష్ దవాఖానను ప్ర భుత్వం ఏర్పాటు చేసింది. గతంలో వికారాబాద్ను ఇద్దరు మంత్రులున్నా పట్టించుకోలేదు. కానీ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే వికారాబాద్ ఆర్వోబీ నిర్మాణానికి రూ.96 కోట్లు, వికారాబాద్ మున్సిపాలిటీకి రూ.60 కోట్లను మంజూరు చేసింది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి మీతోనే ఉన్నా. మీతో నేను కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేశా. మర్పల్లిలో రోడ్డు నిర్మాణానికి రూ.12కోట్లు మంజూరయ్యాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత పనులు ప్రారంభమవుతాయి. మోమిన్పేటలో మైనార్టీ కళాశాల, మర్పల్లిలో ప్ర భుత్వ జూనియర్ కళాశాల, బంట్వారం మం డలంలో ని మాలసోమారంలో బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటా. గెలిచిన నాటి నుంచి మీతోనే ఉన్నా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తా.
– ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ వికారాబాద్ అభ్యర్థి
తెలంగాణలో సీఎం కేసీఆర్ హవా ..
తెలంగాణలో సీఎం కేసీఆర్ హవా నడుస్తున్నది. రోజురోజుకూ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నాయకులు, కార్యకర్తల రాకతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులల్లో వణుకు మొదలైనది. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ పదవీబాధ్యతలు చేపట్టడం ఖాయం. పదేండ్ల కాలంలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి ప్రతి ఇంటికీ అందించారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రం ఐటీ హబ్గా మారింది.
– రంజిత్రెడ్డి, చేవెళ్ల ఎంపీ
బీఆర్ఎస్ అభ్యర్థులదే విజయం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. సీఎం కేసీఆర్ ఇప్పటివరకు చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే వారిని భారీ మెజార్టీతో గెలిపిస్తా యి. వికారాబాద్ జిల్లాతోపాటు కొత్త మండలాలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని జిల్లాను మరింత అభివృద్ధి చేసుకుందాం.
– మంత్రి పట్నం మహేందర్రెడ్డి