సిటీబ్యూరో, జనవరి 28 ( నమస్తే తెలంగాణ ) : మల్కాజిగిరి డీసీపీగా జానకీ ధరావత్, ఎల్బీనగర్ జోన్ డీసీపీగా బి.సాయిశ్రీ, సైబర్ క్రైం డీసీపీగా బి.అనురాధ, యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీగా రాజేశ్ చంద్ర, మల్కాజిగిరి ఎస్వోటీ డీసీపీగా గిరిధర్, డీసీపీ అడ్మిన్గా పి.ఇందిరా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సదరు పోలీసు అధికారులు నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్లో సీపీ డీఎస్ చౌహాన్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
బాలానగర్ డీసీపీగా..
సైబరాబాద్ పరిధిలోని బాలానగర్ జోన్ డీసీపీగా టి. శ్రీనివాస్రావు, సైబరాబాద్ రోడ్ సేఫ్టీ డీసీపీగా ఎల్.చత్రియా నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రను శనివారం కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.