హైదరాబాద్: హైదరాబాద్లోని ఉప్పల్ (Uppal) రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ (Hyderaba), రాజస్థాన్ (Rajasthan) జట్ల మధ్య ఐపీఎల్ (IPL) మ్యాచ్ జరుగనున్నది. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. ఈనేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నగరం నలుమూలల నుంచి ఉప్పల్ మార్గంలో ఆర్టీసీ (RTC) అదనపు సర్వీసులను నడుపుతున్నది. అదేవిధంగా నాగోల్-అమీర్పేట (Nagol-Ameerpet) మార్గంలో మెట్రో (Hyderabad Metro) అదనంగా రైళ్లు నడుపుతున్నది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఎక్కువ సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఆర్టీసీతోపాటు మెట్రో కూడా మరిన్ని సర్వీసులను నడుపనున్నాయి.
ఇక ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు (Rachakonda Police) ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. మ్యాచ్ ఆరంభానికి ముందు, ముగిసిన తర్వాత సికింద్రాబాద్, హబ్సిగూడ, తార్నాక, ఎన్జీఆర్ఐ, హబ్సిగూడ, అంబర్పేట, రామంతపూర్, ఎన్ఎస్ఎల్ ఎరీనా, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్ ఎక్స్రోడ్, కేవీ-1 స్కూల్, వరంగల్ హైవే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు.