ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 8 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీఏ అయిదో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్, నాలుగో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు.
ఫలితాలను ఓయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తమ మార్కుa మెమోలను సంబంధిత కళాశాల నుంచి మూడు వారాల తరువాత నుంచి పొందవచ్చన్నారు. ఈ ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోదలిచిన వారు ఒక్కో పేపర్కు రూ.600 చొప్పున చెల్లించి ఈ నెల 12వ తేదీ వరకు టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 14వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. జవాబు పత్రాల నకలు పొందగోరేవారు ఒక్కో పేపర్కు రూ.1000 చొప్పున చెల్లించి ఈ నెల 13వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని ఆయన తెలిపారు.