మేడిపల్లి,జనవరి 30: రాత్రివేళల్లో ఇళ్లలో చోరీలు చేస్తూ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను, గోల్డ్ రిసీవర్ను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మల్కాజిగిరి డీసీపీ సురేశ్ కుమార్ వివరాలు వెల్లడించారు.
యూపీ,ఢిల్లీకి చెందిన మహాదేవ్ ఝూ, పవన్గుప్తా, మంగళ్సింగ్, సీరామ్ సావ్బీరేంద్ర మేడిపల్లి , చెంగిచెర్ల ప్రాంతంలో రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న నివాస గృహాల్లో తాళాలు పగుల గొట్టి బంగారు ఆభరణాలు,ఇతర విలువైన వస్తువులను దొంగిలిస్తూ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. సాంకేతిక ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజ్తో నిందితులను పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు.