సివిల్ కోర్టులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి రేణుక యార ఆధ్వర్యంలో బుధవారం ఉదయం సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో ఆంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. సివిల్ జడ్జీలతో పాటు ఉద్యోగులు, సిబ్బంది యోగాసనాలు వేశారు.
– నాంపల్లి కోర్టులు, జూన్ 21 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి జిల్లా కోర్టులో ..
రంగారెడ్డి జిల్లా కోర్టులు, జూన్21(నమస్తే తెలంగాణ) : యోగా దినోత్సవాన్ని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరేకృష్ణ భూపతి ముఖ్య అతిథిగా పాల్గొని న్యాయమూర్తులు, న్యాయవాదులందరితో కలిసి ఆసనాలు వేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శలు దీకొండ రవీందర్, మాధవరెడ్డి, న్యాయమూర్తులు భవానీచంద్ర, నర్సిరెడ్డి, మాధవీలత, రంగారెడ్డి జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఇందిర తదితరులు పాల్గొన్నారు.
పతంజలి యోగాపీఠ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హరిద్వార్లోని పతంజలి వెల్నెస్ సెంటర్లో ఒకే రోజున 20వేల మంది యోగా సదస్సులో పాల్గొన్నారు. యోగా గురు బాబా రాందేవ్ యోగా విశిష్టతను, ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ పలు ఆసనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, పతంజలి ఫుడ్స్ ఆచార్య బాలకృష్ణతోపాటు దేశ, విదేశీ ప్రముఖులు పాల్గొన్నట్లుగా పతంజలి యోగాపీఠ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 600 జిల్లాల పరిధిలో యోగా వేడుకలను పతంజలి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ప్రకటించారు. దాదాపు రెండున్నర గంటలపాటు 2100 సార్లు సూర్య నమస్కారాలు నిర్వహించగా.. యోగా, ప్రాణాయామంపై శిక్షణనిచ్చారు.
– సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ)
ఎస్సీఆర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్, పలువురు రైల్వే ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
– సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ)
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో రంగారెడ్డి జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం 31వ ఎడిషన్ ఆఫ్ ఒలంపిక్ డే రన్ -2023ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయులు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతనెలలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలను శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, అసోసియేషన్ అధ్యక్షులు జగదీశ్వర్ యాదవ్, రవికుమార్, డీఎస్డీవో వెంకటేశ్వర్రావు, నారాయణరెడ్డి, భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– ఆర్కేపురం, జూన్ 21