హైదరాబాద్, ఆట ప్రతినిధి : సూరత్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ వీల్చైర్ అంతర్జాతీయ టోర్నీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది.
ఇందులో మన తెలంగాణ నుంచి కోటేశ్వర్, సమీయుద్దీన్ భారత్ తరఫున బరిలోకి దిగుతున్నారని టీమ్ మేనేజర్ శ్రీధర్ రాయల శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత మూడేండ్ల నుంచి తెలంగాణ నుంచి వీల్చైర్ క్రికెట్లో మెరుగ్గా రాణిస్తున్నారని ఆయన తెలిపారు.