వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) బృందం ఆఫ్రికా ఖండంలోని కింగ్డమ్ ఆఫ్ ఈశ్వతిని దేశంలో పర్యటించింది. ఈ సందర్భంగా డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ మక్తల మాట్లాడుతూ ఐటీ రంగంలో ఎంతో ముందంజలో ఉన్న తెలుగు వారి నైపుణ్యాలను వినియోగించుకునేందుకు కింగ్డమ్ ఆఫ్ ఈశ్వతిని రాజు ఈశ్వతి 3, యువరాణి సిబు ద్లామిని, ఐటీ,వ్యవసాయ శాఖ మంత్రి మండ్ల చవుకేలు ఆసక్తి చూపారన్నారు. భారత దేశం ఇప్పటికే ఐటీ రంగంలో సేవలు అందిస్తుండటం, టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ తనదైన ముద్ర వేసుకున్న నేపథ్యంలో తమతో టెక్నాలజీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారన్నారు.
– సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ)