హైదరాబాద్: హైదరాబాద్లోని పాతబస్తీలో ఐటీ అధికారులు (IT Raids) మరోసారి దాడులు చేశారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
కాగా, గతంలోనూ కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో ఐటీ దాడులు చేసింది. అయితే ఆ సమయంలో ఆయన దుబాయ్ వెళ్లిపోయారు. తాజాగా ఆయన్ను దుబాయ్ నుంచి తీసుకొచ్చిన అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను కట్టకుండా తప్పించుకున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చేస్తున్నారు.