HomeHyderabadInauguration Of Kanti Velugu Center In Nacharam
ఆరోగ్యసేవలు వినియోగించుకోవాలి
ప్రజలకు నిరంతరం వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు.
ప్రజలకు నిరంతరం వైద్యసేవలు అందేలా చర్యలు: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి
నాచారంలో కంటి వెలుగు కేంద్రం ప్రారంభం
ఉప్పల్, మార్చి 3: ప్రజలకు నిరంతరం వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం నాచారంలో హెచ్ఎంటీనగర్లో కంటి వెలుగు కేంద్రాన్ని కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీవాసులు కంటి వెలుగు కేంద్రాలలో కంటి పరీక్షలు చేయించుకొని, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి కంటి అద్దాలను ఉచితంగా అందజేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల ఆరోగ్యం కోసం తగిన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి అన్నిరకాల సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నారని చెప్పారు.
వైద్యసేవల కోసం బస్తీ దవఖానాలు, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడంతోపాటు, సీఎం రిలీఫ్ఫండ్, కంటి వెలుగు కేంద్రాలు, పీహెచ్సీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకారం అందిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ ప్రజల కోసం పలు ప్రాంతాల్లో బస్తీ దవాఖానల ఏర్పాటు, పీహెచ్సీల అభివృద్ధి చేశామన్నారు. వైద్యులను అందుబాటులో ఉండేవిధంగా చూస్తున్నామని, ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్రావు, కోటేశ్వర్రావు, జనార్దన్రావు, కిరణ్, యాదగిరిరెడ్డి, నరసింహ, నేతలు సాయిజెన్ శేఖర్, మేకల ముత్యంరెడ్డి, సుగుణాకర్రావు, కట్ట బుచ్చన్న, శ్రీరాం సత్యనారాయణ, బొట్టు యాదగిరి, పీహెచ్సీ సూపర్వైజర్ బోగ ప్రకాశ్ పాల్గొన్నారు.
కంటి వెలుగు కేంద్రం పరిశీలన..
ఉప్పల్లోని లక్ష్మినగర్లోని కంటి వెలుగు కేంద్రాన్ని మేడ్చల్ జిల్లా డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కేంద్రం లో అందుతున్న సేవలను పరిశీలించి, పలు సూచనలు చేశారు. అదేవిధంగా రికార్డులు పరిశీలించి, ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఈ కేంద్రంలో 48 మందికి పరీక్షలు నిర్వహించామని, 15 మందికి కంటి అద్దాలు అం దించామని పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడు తూ.. కంటి వెలుగు కేంద్రాలలో ప్రతి ఒక్కరికి వైద్యసేవలు సక్రమంగా అందేలా చూస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రాలలో ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
కాలనీలో సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి
హబ్సిగూడ డివిజన్ నందవనం కాలనీలో వీధిదీపాలు, డ్రైనేజీ, మ్యాన్ హోల్స్పై కప్పులు, మూత లు వేయించాలని కోరుతూ శుక్రవా రం కాలనీ వాసులు రత్నాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు లోకేశ్వర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎద్దు కృష్ణ, అభితేజ్, నాయకులు లేతాకుల రఘుపతిరెడ్డి, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. – రామంతాపూర్, మార్చి 3