మాదాపూర్, మార్చి 10: పేద ప్రజలకు సేవ చేయాలన్న మానవతా దృక్పథంతో కల్వరి టెంపుల్ దవాఖానలో శుక్రవారం డయాలసిస్ సెంటర్తో పాటు ఐసీయూ వార్డును కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు, డాక్టర్ సతీశ్కుమార్ ప్రారంభించి మాట్లాడారు. మానవ సేవే మాదవసేవ, నిన్నువలె పొరుగువారిని ప్రేమించు అనే సూత్రంతో కల్వరి టెంపుల్లో పలు వైద్య సేవలను అతి తక్కువ ధరకే అందిస్తున్నట్లు తెలిపారు. కేవలం రూ.150కే కన్సల్టెన్సీ అందించడంతో పాటు కేవలం రూ. 999లకే అన్ని ఖర్చులతో కలిపి డయాలసిస్ సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. నిరు పేదల కోసం ఏర్పాటు చేసిన ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.