సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కంటివెలుగు 41వ రోజుకు చేరుకుంది. సోమవారం 274 కేంద్రాల్లో 26,168 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 4032 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా.. 2475 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు వెల్లడించారు.