ఎల్బీనగర్, ఏప్రిల్ 22: కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని, కేసీఆర్పై బురద చల్లడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని రేవంత్రెడ్డి కుట్ర పన్నారని మండిపడ్డారు.
కోర్టు తీర్పు వారికి గుణపాఠం లాంటిదన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చింది ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను పూర్తి చేయాలని, ప్రజలకు మేలు చేయాలని, అంతేతప్ప..కేసీఆర్పై అక్కసుతో ఇబ్బంది పెట్టాలని కాదన్నారు.