బేగంపేట్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే అత్యధిక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ (Minister Talasani Srinivas Yadav ) పేర్కొన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద షాదీముబారక్ ( Shadi Mubarak ) , కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. 96 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. పేదింటి ఆడపడుచుల పెండ్లికి లక్ష నూట పదహార్లు ఆర్థిక సహాయం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెలా పెన్షన్ కింద ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఆర్థిక ఇబ్బందులతో సరైన వైద్యం చేసుకోలేక అవస్థలు పడుతున్న అనేక మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు వెల్లడించారు. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు ( Hospitals ) ఎంతగానో అభివృద్ధి చెందాయని తెలిపారు. రోగులకు అన్ని రకాల చికిత్సలు, పరీక్షలు ఉచితంగా అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప,శేషుకుమారి, నాయకులు శ్రీనివాస్గౌడ్, శ్రీహరి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.