సిటీబ్యూరో, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): దుర్గా మాత విగ్రహాల నిమజ్జనాల సందర్భంగా 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్సాగర్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, గార్డెన్ పాయింట్, జల విహార్ వద్దనున్న బేబీ పాండ్స్, సంజీవయ్య పార్కు వద్ద విగ్రహాల నిమజ్జనం జరుగుతుందన్నారు. దుర్గామాత విగ్రహాల తరలింపు సందర్భంగా ఉండే ట్రాఫిక్ పరిస్థితులను బట్టి ఎప్పకటిప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.