జూబ్లీహిల్స్, ఏప్రిల్16: ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, వంటి అనేక సంక్షేమ పథకాలతో కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండోరోజు మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావునగర్ డివిజన్లో పద్మారావు గౌడ్.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్తో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో పేద ప్రజలు, రైతుల పక్షాన ఢిల్లీలో తెలంగాణ గళం వినిపించేందుకు ఈ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.