సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ): భారత స్వాతంత్య్రం అనంతరం పాకిస్థాన్, చైనా పౌరసత్వం పొందిన వ్యక్తులు వదిలిపెట్టిన స్థిరాస్తుల విక్రయాల ప్రక్రియను కేంద్ర హోంశాఖ ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా శత్రు ఆస్తులు (ఎనిమీ ప్రాపర్టీస్) సుమారు 12,611 వరకు ఉండగా… వీటి విలువ సుమారు లక్ష కోట్లకు పైగా ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. భారత ప్రభుత్వం శత్రు ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కింద ఏర్పాటు చేసిన అథారిటీ అయిన కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా( సీఈపీఐ)కి అప్పగించబడ్డాయి.
ఈ పేరుతో ప్రత్యేకంగా సంస్థతో పాటు దేశంలోని వివిధ రాష్ర్టాల వారీగా ఉన్న సిరాస్తుల వివరాలను వెబ్సైట్లో ఉంచారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కేరళ, ఢిల్లీతో పాటు భారీగా శత్రు ఆస్తులను కలిగి ఉన్న ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉంది. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం 158 ఆస్తులు మూడు జిల్లాల పరిధిలో ఉన్నట్లు(https://enemyproperty.mha. gov.in)లో పొందుపర్చారు. దీనికి ప్రకారం హైదరాబాద్ జిల్లాలో 35, ఖమ్మంలో 4, రంగారెడ్డి జిల్లాలో 119 వరకు ఉన్నాయి. వీటితో పాటు మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించారు.
1968లో వచ్చిన ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం గుర్తించిన స్థిరాస్తులను ఆయా రాష్ర్టాల పరిధిలోనే ఉండగా, అక్కడి రెవెన్యూ అధికారులు వాటిని రక్షిస్తున్నారు. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం శత్రు ఆస్తులను గుర్తించేందుకు సర్వే సైతం చేపట్టింది. కేంద్రం ఈ భూములను అమ్మకానికి పెట్టినప్పుడల్లా, పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించడానికి ఈ భూములను కోరడంతో పాటు, ఈ భూముల అమ్మకం ద్వారా వచ్చిన నిధులలో కొంత భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని కోరుతోంది.
తెలంగాణలో ఎనిమీ ప్రాపర్టీస్ వివరాలు ఇలా…