హైదరాబాద్ : ఉత్తరాఖండ్లోని అలకనంద నదిలో హైదరాబాద్ యువకుడు గల్లంతయ్యాడు. ఉత్తరాఖండ్ ఎన్ఐటీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఆనంద్ మోహన్ అనే యువకుడు స్నేహితులతో సరదాగా గడిపేందుకు అలకనంద నదీ తీరానికి వెళ్లాడు. ఎత్తైన ప్రదేశం నుండి నదిలోకి దూకిన ఆనంద్ మోహన్ ఎంతసేపటికీ బయటకి రాకపోవడంతో అతడి స్నేహితులు పోలీసులు, కాలేజ్ యాజమాన్యానికి సమాచారమిచ్చారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడం, చీకటి పడడంతో ఎంత సేపు గాలింపు చర్యలు చేపట్టినా ఆనంద్ ఆచూకీ లభించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Parrots | చిలుకలు వన్యప్రాణులే.. పంట నష్టానికి పరిహారం చెల్లించాల్సిందే..బాంబే హైకోర్టు తీర్పు
Himalayas | హిమాలయాల్లో 23 ఏండ్ల కనిష్ఠానికి మంచు..200 కోట్ల మందికి నీటి సంక్షోభ
Peddi | రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఫిక్స్ .. లీక్ చేసిన బుచ్చిబాబు